YS Jagan: జగన్ 2.0లో.. అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చాక తాను ముందుగా ఇచ్చే ప్రయారిటీ పార్టీ కార్యకర్తలే అని మరోసారి స్పష్టం చేసారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో జగన్ ఈరోజు సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడిపోయిన రాజకీయాల్లో మీరు తులసి మొక్కలా నిలిచారు. MPTC, ZPTC, కౌన్సిలర్ అయిన మీరు సీఎం చంద్రబాబు నాయుడుకు రాజకీయం ఎలా చేయాలని నేర్పించినందుకు హ్యాట్స్ ఆఫ్ అన్నారు. జగన్ 2.0 లో మాత్రం మొట్టమొదటి పీఠం కార్యకర్తలకే.. ఇది కచ్చితంగా చెప్తున్నా.. వైయస్ఆర్సీపీ కార్యకర్తల బాధలు, కష్టాల్ని స్వయంగా చూస్తున్నా.. అందుకే జగన్ 2.Oలో టాప్ ప్రయారిటీ కార్యకర్తలకే ఇస్తా. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసులు, అధికారుల పేర్లని రాసి పెట్టుకోండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సినిమా మామూలుగా ఉండదు.. వేరే లెవల్లో ఉంటుందంతే అంటూ జగన్ వ్యాఖ్యానించారు.