Pakistan: ఒక దేశం చనిపోయిన వ్యక్తికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోందంటే అతను ఆ దేశం కోసమో రాష్ట్రం కోసమో లేదా ఏదైనా వృత్తిలో తనదైన ప్రతిభను చాటుకున్నారని అర్థం. కానీ వక్ర బుద్ధి పాకిస్థాన్ మాత్రం నిన్న భారత్ ఆపరేషన్ సింధూర్లో మట్టుబెట్టిన ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోంది. ఏమనాలి ఈ పాకిస్థాన్ని?
ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ భారత్పై ఉసిగొల్పడమే కాకుండా వారిని చంపితే అదేదో గొప్ప త్యాగం చేసినట్లు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి సిగ్గు లేదూ అంటూ విదేశాంగ్ సెక్రటరీ విక్రమ్ మిశ్రి మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్లో సాధారణ పౌరులు కూడా మరణించారు అని పాక్ అసత్య ప్రచారాలు చేస్తోందని అసహనం వ్యక్తం చేసారు. అధికారిక లాంఛనాలలో లష్కరే తైబాకి చెందిన ఉగ్రవాది కూడా ఉండటం పాక్ నీచబుద్ధిని మరోసారి రుజువు చేసిందని మండిపడ్డారు. బహుశా ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం అనేది పాకిస్థాన్కు అలవాటేమో అంటూ విక్రమ్ మిశ్రా ఎద్దేవాచేసారు.