Tirumala Prasadam తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవల దర్శనాల్లో పలు మార్పులు చేపడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. దర్శనాల విషయంలో మార్పులు చేయడమే కాకుండా తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో పెట్టే ప్రసాదంలో కూడా కీలక మార్పు చేసారు. ఈ అన్నదాన సత్రంలో పెట్టే భోజనంలో ఓ కొత్త వంటకాన్ని చేర్చాలని నిర్ణయించారు.
సాధారణంగా భక్తులకు వెంగమాంబ అన్నదాన సత్రంలోనే కాకుండా అన్నప్రసాద కౌంటర్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు. రోజూ ఇచ్చే ప్రసాదాలతో పాటు మరో కొత్త వంటకాన్ని కూడా చేర్చబోతున్నారు. వెంగమాంబ నిత్య అన్నదాన సత్రంలో రోజూ 2 లక్షల మంది భక్తులు ప్రసాదం తింటుంటారు. ఇందుకోసం తిరుమల తిరుమతి దేవస్థానం రోజూ రూ.38 లక్షల మేర ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం తిరుమలలో వాడుతున్న ఆహార తయారీ యంత్రాలు 15 ఏళ్ల నాటివి. వాటిని కొత్త యంత్రాలతో భర్తీ చేయనున్నారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రముక మోటర్ల కంపెనీ అయిన టీవీఎస్తో ఒప్పందం కుదుర్చుకుంది.