Pahalgam Attack: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో టాప్ తాలిబన్ నేత అడుగుపెట్టడం సంచలనంగా మారింది. పహల్గాం దాడి జరిగిన తర్వాత మే 3న ఇబ్రహీం ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు. ఇతను అఫ్ఘానిస్థాన్లో డిప్యూటీ ఇంటరీయర్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నాడు. మిలిటరీ పరంగా మంచి పట్టున్నవాడు. ముఖ్యంగా పాకిస్థాన్కి వ్యతిరేకి. ఇరాన్ సెక్యూరిటీ వ్యవస్థతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి.
అసలు ఇతను ఢిల్లీకి వచ్చి ఏం చేసాడు? ఎవరితో మాట్లాడాడు? అనేది ఎవ్వరికీ తెలీదు. అఫ్ఘానిస్థాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నాక సొంతంగా ప్రభుత్వాన్ని స్థాపించి నడుపుతున్నారు. భారత్కు అఫ్ఘానిస్థాన్తో ఎలాంటి సత్సంబంధాలు లేవు. ఇబ్రహీం భారత్కు రాకముందు భారత దౌత్యాధికారి ఒకరు అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబుల్కి వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత సదర్ ఇక్కడికి వచ్చారట. అంటే ఇరు వైపుల నుంచి కమ్యునికేషన్ ఉన్నట్లే. దీని గురించి భారత ప్రభుత్వం అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ.. సదర్ ఢిల్లీకి వచ్చారని మాత్రం జాతీయ మీడియా కూడా చెప్తోంది.