Case on Gautam Adani భారత్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త.. అదానీ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీపై అగ్రరాజ్యం అమెరికాలో కేసు నమోదైంది. దాంతో ఆయనపై అమెరికన్ పోలీస్ అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేసారు. అదానీ సోలార్ ప్రాజెక్ట్ విషయంలో ఈ కేసు నమోదైంది. సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ల కోసం లంచం ఇచ్చి లబ్ది పొంది మోసానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయంలో ఆయనపై అమెరికాలో కేసు నమోదైంది. అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. దేశంలో ఏ ఎన్నిక జరిగినా ప్రథానంగా ముగ్గురు పేర్లు బయటికి వస్తుంటాయి. ఒకటి అదానీ, రెండు అంబానీ, మూడు అమిత్ షా. ప్రతిపక్షాలు పదే పదే అదానీపై ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. సోలార్ ప్రాజెక్ట్ విషయంలో ఈ అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టుల కోసం 265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చి మోసానికి పాల్పడినట్లు అమెరికాలో ఆరోపణలు ఉన్నాయి. ఈ సోలార్ ప్రాజెక్ట్ నేపథ్యంలో అదానీ అమెరికా విదేశీ లంచ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ విషయంలో అదానీపై కేసు నమోదు చేసారు. 20 ఏళ్లలో రెండు బిలియన్ డాలర్ల లాభం పొందినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఏ క్షణమైనా అదానీ అరెస్ట్
Case on Gautam Adani ఈ నేపథ్యంలో అదానీని ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అదానీ ఇండియాలో ఉంటే ఇక్కడి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఆయన్ను అమెరికాకు తరలించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతారట. ఒకవేళ ఆయన అమెరికాలో ఉన్నట్లైతే వెంటనే అదుపులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అదానీ సంస్థకు చెందిన కార్యకలాపాలను చూసుకునే అధికారులు లంచాలు ఇస్తున్నట్లు.. కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఫోటోలు కూడా అమెరికా అధికారుల చేతిలో ఉన్నాయి. స్ట్రాంగ్ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే వారు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాంట్రాక్టుల కోసం Mr A, numero uno, the big man అనే కోడ్ పదాలు కూడా వాడారట. ఈ స్కాంలో ఉన్న వ్యక్తుల్లో కొందరు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పాల్పడ్డారట.
అదానీ షేర్స్ ఢమాల్
అదానీ లంచాలు ఇచ్చి స్కాంకు పాల్పడ్డారన్న వార్త పొక్కడంతో అదానీ సంస్థ షేర్లు కుదేలయ్యాయి.
అదానీ ఎంటర్ప్రైజెస్ : 10%
అదానీ గ్రీన్ ఎనర్జీ : 18%
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ : 20%
అదానీ పోర్ట్స్ : 10%
రేవంత్కు అదానీ రూ.100 కోట్ల లంచం
అదానీ స్కాం వార్త బయటికి రాగానే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అదానీ నుంచి ముడుపులు అందాయని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గతంలో అదానీని దొంగ అని సంబోధించిన రేవంత్ ఇటీవల తెలంగాణలో అదానీ సంస్థల నుంచి పెట్టుబడులు తీసుకొస్తామని ప్రకటించారని.. ఆ సమయంలోనే అదానీ నుంచి రేవంత్కు రూ.100 కోట్లు లంచం ముట్టిందని ఆరోపించారు. తెలంగాణలో అదానీ సంస్థ ఏరో స్పేస్ పార్క్, డేటా సెంటర్ ఏర్పాటు చేయడంపై చర్చలు జరిగాయి.
అదానీ స్పందనేంటి?
Case on Gautam Adani ఇక ఎప్పటిలాగే తమ సంస్థపై ఎవరైనా ఆరోపణలు చేస్తే ఖండించేందుకు అదానీ రెడీగా ఉంటారు. ఇప్పుడు అమెరికా చేస్తున్న ఆరోపణలను కూడా ఆయన కొట్టిపారేసారు. అసలు తాము లంచాలు తీసుకున్నట్లు వార్తల్లో వస్తేనే తెలుసుకున్నామని.. తమపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు కానీ విచారణలు జరుగుతున్నట్లు కానీ తెలీదని అన్నారు. తాము స్కాంకు పాల్పడ్డామని కేవలం ఆరోపణలు చేస్తే సరిపోదని సాక్ష్యాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.