Shilpa Shirodkar: కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్లో కేసులు ఉన్నాయని అక్కడి ప్రభుత్వాలు ప్రకటించగా.. ఇప్పుడు భారత్లోనూ కేసులను గుర్తించారు. సూపర్స్టార్ మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్కు కోవిడ్ సోకిందట. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఆమెకు భారత్లో ఉండగానే కరోనా వచ్చిందా.. లేదా విదేశాలకు వెళ్లి వచ్చాక సోకిందా అనేది తెలియాలి. మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ సొంత చెల్లెలే శిల్పా.
హాంకాంగ్, సింగపూర్లో కొవిడ్తో పాటు అడినోవైరస్, రైనో వైరస్ వ్యాప్తిచెందుతోందట. హాంకాంగ్లో 17, 13 నెలల చిన్నారులకు వైరస్ సోకింది. ఈనెల 3న తొలి కేసు నిర్ధారణ కాగా.. వారంలోనే వేలల్లో కేసులు నమోదయ్యాయి. సింగపూర్లో వారంలో 14,200కు కేసులు పెరిగాయి. సింగపూర్, హాంకాంగ్లో మళ్లీ మాస్క్ తప్పనిసరిగా వాడాలని అక్కడి ప్రభుత్వాలు ఆదేశించాయి. వైరస్ వ్యాప్తి, తాజా పరిస్థితిపై WHO ఆరాతీస్తోంది.