Naga Chaitanya నాగచైతన్య శోభిత ధూళిపాల జంట డిసెంబర్ 4న వివాహ బంధంతో ఒకటి కానుంది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి వివాహం అట్టహాసంగా జరగబోతోంది. అయితే.. వీరి వివాహం రాజస్థాన్లోని ఓ ప్యాలెస్లో జరగబోతోందని టాక్ నడిచింది. తీరా చూస్తే హైదరాబాద్లోనే అని క్లారిటీ ఇచ్చేసారు. దీనిపై నాగచైతన్య స్పందించారు. ఈరోజు నాగచైతన్య తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇందుకోసం ఆయన గోవాకు వెళ్లారు.
“” పెళ్లి దగ్గరపడుతోందన్న ఆతృత ఎక్కువగా ఉంది. సెంటిమెంట్ కావడంతో అన్నపూర్ణ స్టూడియోస్లో పెళ్లి అనుకుంటున్నాం. అక్కడైతే తాతగారి ఆశీర్వాదాలు ఉంటాయని మేం నమ్ముతాం. తాతగారి విగ్రహం ముందే మా పెళ్లి జరగబోతోంది. ఈరోజు నా బర్త్డే కావడంతో గోవాకి వచ్చాను. నాకు ఆడంబరంగా బర్త్డేలు చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే స్నేహితులతో కలిసి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. ప్లానింగ్ విషయాన్ని శోభిత నాకే వదిలేస్తుంది. తను నాతో ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు “” అని తెలిపారు.
సింపుల్గానే పెళ్లి చేయమన్నారు
కుమారుడు నాగచైతన్య పెళ్లి గురించి అక్కినేని నాగార్జున స్పందించారు. నిశ్చితార్థం రోజు అంతా కూర్చుని ఎలా పెళ్లి చేయాలి అని చర్చించుకున్నామని.. తమకు సింపుల్గా పెళ్లి చేస్తే చాలు అని శోభిత, నాగచైతన్య అనడంతో తానెంతో రిలీఫ్ అయ్యానని అన్నారు. పెళ్లి బాధ్యతను తనపై పెట్టడంతో అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటున్నానని అన్నారు.