Himanshi Narwal: కళ్లముందే భర్తను చంపింది కాక.. పోయి మోదీకి చెప్పుకోపో అని ఓ ఉగ్రవాది తనతో అన్న మాటలను ఇంకా మర్చిపోలేదు పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నార్వాల్ సతీమణి హిమాన్షి నార్వాల్. ఈరోజు భారత్ ప్రతీకార చర్యగా పాకిస్థాన్పై చేసిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా 80 మంది ఉగ్రవాదులు చచ్చిన నేపథ్యంలో హిమాన్షి స్పందించారు. ఆరోజు నా భర్తను చంపి మోదీతో చెప్పుకో అన్నాడు. నేను చెప్పాను. మోదీ బదులిచ్చారు అని హిమాన్షి సంతోషం వ్యక్తం చేసారు.
“” ఆరోజు ఆ మాటలు ఇంకా నా చెవిన మారుమోగుతున్నాయి. మా పెళ్లై కేవలం ఆరు రోజులే అయ్యింది. దయచేసి వదిలేయండి అని వేడుకున్నాను. ఇదే మాట మోదీతో పోయి చెప్పుకోపో అన్నాడు. నేను చెప్పాను. మోదీ ఈరోజు బదులిచ్చారు. మెరుపు దాడి జరిగింది ఉగ్రవాదులు చచ్చారని తెలిసి ఓ పక్క సంతృప్తికరంగా ఉన్నప్పటికీ నా వినయ్, మిగతా 25 మంది ప్రాణాలతో లేరే అనే బాధ లోలోపల చంపేస్తోంది “” అంటూ హిమాన్షి ఉద్వేగానికి లోనయ్యారు.