Bhuma Mounika Reddy ఓ పక్క మంచు కుటుంబంలో (Manchu Family) ఆస్తుల వివాదం ముదిరిపోతోంది. ఎవరికి వారు ప్రెస్ మీట్లు పెట్టి నాది తప్పు కాదంటే నాది కాదు అని చెప్పుకుంటున్నారు. మరోపక్క మీడియాపై దాడి చేసిన తర్వాత మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం పక్కనపెడితే ఇప్పుడు భూమా కుటుంబంలోనూ ఆస్తుల విషయంలో రచ్చ జరుగుతోందట.
భూమా నాగి రెడ్డి, శోభా రెడ్డిల చిన్న కూతురైన భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇటీవల పండంటి ఆడపిల్ల పుట్టింది. అయితే.. ఎప్పుడైతే మనోజ్ తనకు ఇంకా ఆస్తులు రావాల్సి ఉన్నాయని తన తండ్రి సోదరుడితో అనడంతో.. మౌనిక కూడా తన సోదరి అఖిల ప్రియను తన ఆస్తి త్వరగా తనకు రాసివ్వాలని ఫోర్స్ చేస్తోందట. నాగి రెడ్డి, శోభా రెడ్డిలకు ముగ్గురు సంతానం. అఖిల ప్రియ, మౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డి. అఖిల ప్రియ తన తల్లిదండ్రుల్లానే రాజకీయాల్లో రాణించాలనుకున్నారు. అలా తెలుగు దేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు.
Bhuma Mounika Reddy తల్లిదండ్రులు లేకపోవడంతో అఖిల ప్రియే ఇంటి పెద్దగా ఉంటూ సోదరిని, తమ్ముడిని చూసుకుంటున్నారు. మౌనికకు పెళ్లి అయిపోవడంతో ఇక ఆస్తుల పంపకాల విషయంలో చర్చలు మొదలయ్యాయి. తనకు రావాల్సిన ఆస్తి తనకు ఇవ్వాలంటూ మౌనిక అఖిలను అడిగారు. ఇస్తాను ఇస్తాను అంటున్నారు కానీ అఖిల ప్రియ ఏ సంగతి తేల్చడం లేదట. అయితే.. ఇటీవల మౌనికకు తన ఆస్తుల విషయంలో ఓ షాకింగ్ విషయం తెలిసిందట. కొన్ని ఆస్తుల విషయంలో మౌనికకు తెలీకుండా ఆమె సంతకాలు ఫోర్జరీ చేసారని.. పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని డిపాజిట్లు కూడా చేసారని తెలుస్తోంది. నంద్యాల, ఆళ్లగడ్డలోని పద్మావతి నగర్లో ఉన్న రూ.4 కోట్ల విలువైన భూమి విషయంలో మౌనిక సంతకాలు ఫోర్జరీ చేసారట. ఈ విషయం మౌనికకు తెలీడంతో ఆమె షాక్కు గురయ్యారట. వెంటనే ఈ విషయాన్ని అఖిల ప్రియ దృష్టికి తీసుకెళ్లారు. తనకు రావాల్సిన ఆస్తుల విషయంలో క్లారిటీ ఉండాలని.. తనకు తెలీకుండా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు తెలిస్తే న్యాయపరంగా ముందుకెళ్తానని హెచ్చరించినట్లు సమాచారం.