India Pakistan War: ఓ పక్క భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. మా సమస్య పాకిస్థాన్తో పాటు పాక్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాదులతో అని భారత్ ఎన్నిసార్లు చెప్పినా పాక్ చెవికెక్కడం లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ రాజస్థాన్, పంజాబ్, కశ్మీర్ సరిహద్దుల్లో దాడులు చేస్తోంది.
ఈ నేపథ్యంలో అమెరికాకి చెందిన రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ డేల్ స్టార్క్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ఇండియా, పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో తన పందెం భారత్పైనే అంటూ కామెంట్ చేసారు. భారత ఆర్మీకి ఆ సత్తా ఉందని అన్నారు. అది నిజమే కానీ ఈ సమయంలో పందేలు ఎంత వరకు కరెక్ట్? డేల్ స్టార్క్ తన కెరీర్లో పాక్, భారత పైలట్లతో కలిసి పనిచేసారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ఇలాంటి పందేలు వేయడం, కామెంట్స్ చేయడం సబబు కాదు. ఏమంటారు..?