Covid 19: భారత్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.. ముంబైలో ఆల్రెడీ ఇద్దరు వ్యక్తులు కరోనా సోకి చనిపోయారని వస్తున్న రూమర్స్పై క్లారిటీ వచ్చేసింది. ఇద్దరు యువతులు రెండు రోజుల క్రితం స్థానిక సిటీ హాస్పిటల్లో చనిపోయారు. అయితే వారిద్దరూ కోవిడ్ వల్ల చనిపోయారని ప్రచారం జరిగింది. దీనిపై ఈరోజు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) క్లారిటీ ఇచ్చింది. వారిద్దరిలో ఒకరికి క్యాన్సర్ కాగా.. మరొకరు ఫిట్స్ కారణంగా చనిపోయారే తప్ప కోవిడ్ వల్ల కాదని.. దయచేసి ఇలాంటి సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని అన్నారు.
ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కోవిడ్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్లోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. మళ్లీ మాస్కులు ధరించాల్సిన అవసరం ఉందని.. కోవిడ్ కేసులు ఉన్నా లేకపోయినా కొంతకాలం పాటు మన జాగ్రత్తలో మనముంటే మంచిదని అధికారులు కూడా చెప్తున్నారు. బాలీవుడ్ నటి, మహేష్ బాబు మరదలైన శిల్పా శిరోద్కర్కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతానికి యావత్ భారతదేశంలో దాదాపు 280 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నట్లు సమాచారం.