Karate Kalyani Ram Charan Controversy మెగా పవర్స్టార్ రామ్చరణ్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఆయన అయ్యప్ప దీక్షలో ఉన్నారు. మాల వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల దర్గాకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ప్రముఖ నటి కరాటే కల్యాణి స్పందిస్తూ.. రామ్ చరణ్కు ఎవరైనా జ్ఞానాన్ని ప్రసాదిస్తే బాగుంటుంది అని ట్వీట్ చేసారు. దాంతో చరణ్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. దీనిపై కరాటే కల్యాణి వీడియో ద్వారా స్పందించారు.
“” రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏంట్రా తెగ రెచ్చిపోతున్నారు? అసలు ఆయన్ని నేనేమన్నాను. రామ్చరణ్కు జ్ఞానం ప్రసాదిస్తే బాగుంటుంది అని పోస్ట్ చేసాను. అందులో తప్పేముంది. ఆయన మాల వేసుకుని దర్గాకు ఎలా వెళ్తారు? ఇది చాలా పెద్ద తప్పు. ఎవరికో ఇచ్చిన మాట కోసం ఆయన దర్గా వెళ్లడం ఏంటి? ముస్లింలను ఇతర మతాల వారిని ఇలాగే గుళ్లకు తీసుకెళ్తున్నారా? లేదు కదా? ఫ్యాన్స్ నన్ను నానా మాటలు అంటున్నారు.
నేను కూడా రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు అభిమానినే. కానీ ఇంట్లో తల్లిదండ్రులను కష్టపెట్టి వారి నుంచి డబ్బులు తీసుకుని హీరోల పోస్టర్లకు పాలాభిషేకాలు చేసే ఫ్యాన్ని కాదు నేను. నాకు ముందు నా తల్లిదండ్రులు ఆ తర్వాత దేవుడు, నా మతం, నా హిందూ ధర్మమే ముఖ్యం. ఆ తర్వాతే హీరో అయినా ఎవరైనా. అంతేకానీ నాకు హీరోలు దేవుళ్ల కన్నా ఎక్కువ కాదు. నన్ను తిట్టే ముందు మీ ధర్మం గురించి ఆలోచించండి. హిందూ ధర్మం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఒక్కడూ ఖండించేందుకు ముందుకు రారు కానీ.. ఇలా తిట్టాడానికి మాత్రం ఎగేసుకొస్తారు.
యోగి ఆదిత్యనాథ్ కూడా దర్గా వెళ్లారు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన దర్గాకు వెళ్లారు కానీ టోపీలు పెట్టించుకోలేదు. ఆయన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి అన్ని మతాల వారిని సమానంగా చూడటం ఆయన వృత్తిలో భాగం. ఓ ముస్లిం సోదరుడో క్రైస్తవ సోదరుడో వచ్చి సర్ ఒకసారి చర్చికో దర్గాకో రండి అంటే ఆయన ప్రజలు అడిగారు కదా అని వెళ్తారే తప్ప టోపీలు పెట్టించుకోవడం వంటివి చేయలేదు. కానీ మనం అలా కాదు. దర్గాలకు వెళ్లిపోతాం.. టోపీలు పెట్టించుకుంటాం.. ఇఫ్తార్ విందులకు వెళ్తాం. మనకు సిగ్గు ఉండాలి. ఇతర మతాల వారినైనా చూసి బుద్ధి తెచ్చుకుందాం.
కృష్ణుడి గెటప్లో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టేందుకు కూడా ఒప్పుకోకుండా నేను ధర్నా చేసాను. నాకు ధర్మం ముందు ఎవరైనా సమానమే. ఎవర్నైనా ఎదిరిస్తాను. రామ్ చరణ్ అభిమానులకు దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడండి. సోషల్ మీడియాలో సొల్లు వాగడం కాదు. నేను సినిమాల్లోకి రాకముందే పేరు తెచ్చుకున్నాను. నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ని. ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాను. హరికథలు చెప్పగలను. నాకు ఇప్పటికీ ఆ గుర్తింపు ఉంది. సినిమాలు లేకపోయినా నేను బతకగలను. మీరెవరు నేను చేసిన పాత్రల గురించి ప్రశ్నించడానికి. మీరేమన్నా నాకు అన్నం పెట్టారా? నా తల్లిదండ్రులకు, నా గురువులకు మాత్రమే నేను సమాధానం చెప్పాలి. మీలాంటి ఎదవలకు కాదు “” అని మండిపడ్డారు.

రామ్చరణ్ దర్గా వివాదం ఏంటి?
ఆంధ్రప్రదేశ్లోని కడపలో జరిగిన 80వ జాతీయ ముషైరా ఘజల్ కార్యక్రమానికి ఇటీవల రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన అయ్యప్ప మాలలో ఉండగా.. కడప అజ్మేర్ దర్గాను దర్శించుకున్నారు. అది కాస్తా వివాదంగా మారింది. ఈ దర్గాతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని.. మగధీర రిలీజ్కి ముందు కూడా ఓసారి ఈ దర్గాకు వచ్చానని చరణ్ అన్నారు.