Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో చోటుచేసుకున్న భీకర ఉగ్రదాడి గురించి ప్రధాని నరేంద్ర మోదీకి ముందే తెలుసా? దాడి జరగడానికి మూడు రోజుల ముందే మోదీకి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం వచ్చిందని.. అందుకే ఆయన జమ్మూ కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఈ మాటలు అన్నది కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. రాజధాని శ్రీనగర్లోని జబర్వాన్ ప్రాంతంలోని పర్యాటకులను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇంటెల్ వర్గాలు మోదీకి చెప్పినప్పుడు ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదని ఖర్గే ప్రశ్నించారు. నిజానికి మోదీ ఏప్రిల్ 19న జమ్మూ కాశ్మీర్లో పర్యటించాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఆయన పర్యటన రద్దు చేసుకోవడం.. ఆ తర్వాత మూడు రోజులకు ఉగ్రదాడి జరగడం యాదృచ్చికంగానే జరిగి ఉండచ్చు. ఈ మాత్రం దానికే మనం ప్రధానిపై నిందలు వేయలేం. లోపాలు ఉన్నాయని ఆయనే స్వయంగా ఆల్ పార్టీ మీటింగ్లో అన్నారు కూడా. మృతుల మరణానికి తగ్గట్టుగా ప్రతీకారం తీర్చుకుందామని కూడా మాటిచ్చారు. చూడాలి..ఏం చేస్తారో..!