Mohan Babu సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నిన్న జల్పల్లిలోని తన నివాసం వద్ద మీడియా వర్గాలపై దాడి చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. దాంతో ఈరోజు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీసుని సవాలు చేసారు. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను సెక్యూరిటీ కోరినా భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్ వేసారు. మోహన్ బాబు తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేసారు. ప్రస్తుతం మోహన్ బాబు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా మంచు ఇంట్లో ఆస్తుల వివాదం నడుస్తోంది. నాలుగు గోడల మధ్య జరగాల్సిన చర్చ కాస్తా రోడ్డు మీదకు వచ్చింది. దాంతో మీడియా వర్గాలన్నీ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దే ఉన్నాయి. మోహన్ బాబుని చూసిన జర్నలిస్టులు ప్రశ్నలు వేస్తుంటే మైకు లాక్కుని దాడి చేసారు. ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. దాంతో ఆయనపై జర్నలిస్టుల సంఘం కేసు వేసింది.

Mohan Babu హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు
More News
Aamir Khan Marriage: మా పెళ్లైపోయింది
Aamir Khan Marriage: బాలీవుడ్ సూపర్స్టార్ ఆమిర్ ఖాన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా…
Viral News: శివయ్యా నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా?
Viral News: శివయ్య నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా? నీ కొడుకు అయితే ఇలానే రాస్తావా?…
Financial Issues: తులసమ్మ ఇచ్చే వార్నింగ్లు ఇవే
Financial Issues: మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో…
Manchu Vishnu: ఈ హగ్ కోసం 22 ఏళ్లు ఎదురుచూసా
Manchu Vishnu: మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటించిన కన్నప్ప సినిమా ఈ నెలాఖరున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!