Search The Query
Search

Image
  • Home
  • News
  • YS Sharmila: అద్దంలో ముఖం చూసుకున్నా చంద్ర‌బాబే క‌నిపిస్తున్నారా?

YS Sharmila: అద్దంలో ముఖం చూసుకున్నా చంద్ర‌బాబే క‌నిపిస్తున్నారా?

YS Sharmila: YCPకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదు. కళ్ళకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్లు లేదు అంటూ ట్విట‌ర్ వేదిక‌గా మండిప‌డ్డారు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిళ. ష‌ర్మిళ ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టినా ఆమె ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలో ఆయ‌న చెప్పిన‌ట్లే న‌డుచుకుంటున్నార‌ని అంబటి రాంబాబుతో మ‌రికొంద‌రు వైసీపీ నేత‌లు ఆరోపించారు. దీనిపై ఆమె స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు గారు కనిపించడం చాలా బాధాకరం. ఏది చేసినా అర్థం, పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనం. స్వయంశక్తితో ఎదుగుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే, ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లో ముద్ర వేసుకుంటుంటే, చూసి ఓర్వలేక, అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతకానితనానికి నిదర్శనం. 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా.. మీ నీచపు చేష్టలు మారలేదు. అసత్యాలు వల్లె వేయడం మానుకోలేదు. నిజాలు జీర్ణించుకోలేని మీరు..ఇక ఈ జన్మకు మారరు అని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థం అయ్యింది.

ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసు. తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రయోజనాలను మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి.. స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. ప్యాలెస్ లు కట్టుకున్నారు. సొంత ఖజానాలు నింపుకున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తెచ్చి ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారు. రిషికొండను కబ్జా చేయాలని చూశారు. మొత్తంగా మోడీ దోస్తులకు రాష్ట్రాన్ని దోచి పెట్టారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలో మోడీకి మద్దతుగా నిలిచి 5 ఏళ్ల పాటు మోదాని సేవలో తరించినట్లు ప్రజలకు సర్వం బోధపడింది.

ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన ఖర్మ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డికి పట్టలేదు. పులి బిడ్డ పులిబిడ్డే. ఈ రాష్ట్రంలో BJP అంటే బాబు, జగన్, పవన్.. అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరి చేసేవే.. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తుంది. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోవడానికి మీకు దమ్ములేకుంటే.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాలను బయట ఉండి ఎత్తిచూపుతూ.. ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడుతున్నది ఈ రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే.

వక్ఫ్ బిల్లుకి మద్దతు పలికి ముస్లింలకు ఇఫ్తార్ విందులో బాబు విషం పెట్టారని చేసిన మా ఆరోపణలు వినపడకపోవడం మీరు చెవిటోళ్లు అనడానికి… పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మా ఆవేదన కనపడకపోవడం మీరు గుడ్డోళ్ళు అనడానికి నిదర్శనం. మీకు ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి పోలవరం మీద ఎందుకు ప్రశ్నించలేదు ? అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ మోసాలను ఎందుకు ఎండగట్టలేదు ? మీ నీచపు కుయుక్తులతో, పాపపు సొమ్మును ఎరగా చూపి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలనే కుట్ర తప్పా ప్రజా సమస్యలపై మీకు ఏమాత్రం శ్రద్ధ లేదు. కాంగ్రెస్ ఎదగడం చూసి మీరు భయపడుతున్నారు అనేది పచ్చి నిజం. అంటూ ష‌ర్మిళ నిప్పులు చెరిగారు.

More News

Actress Hema
Hema: న‌టి హేమ ఇంట విషాదం
BySai KrishnaNov 18, 2025

Hema: టాలీవుడ్ న‌టి హేమ ఇంట విషాదం నెల‌కొంది. ఆమె త‌ల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో రాజోలులో కన్నుమూశారు. విషయం…

Actress Tulasi
Senior Actress Tulasi: సినిమాల‌కు గుడ్‌ బై
BySai KrishnaNov 18, 2025

Senior Actress Tulasi: ఎన్నో సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించిన సీనియ‌ర్ న‌టి తుల‌సి యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసారు. ఈ…

SS rajamouli gets shock from producers council for the film Varanasi
Varanasi: రాజ‌మౌళికి షాక్‌.. టైటిల్ మారుస్తారా?
BySai KrishnaNov 18, 2025

Varanasi: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క వార‌ణాసి సినిమాకు ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ నుంచి షాక్ త‌గిలింది. ఈ సినిమాను…

Aadhaar card logo
Blue Aadhaar: పిల్ల‌ల ఆధార్‌ను ఉచితంగా ఎలా అప్డేట్ చేసుకోవాలి?
BySai KrishnaNov 18, 2025

Blue Aadhaar: పిల్ల‌ల‌కు సంబంధించిన బ్లూ ఆధార్ విష‌యంలో UIDAI కీల‌క అప్డేట్ ఇచ్చింది. UIDAI బిహేవియోర‌ల్ ఇన్‌సైట్స్ లిమిటెడ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top