Vijaya Sai Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను.. అంటూ వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి షాకింగ్ ట్వీట్ చేసారు.
లిక్కర్ స్కాంలో ఏపీ సీఐడి విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఈ స్కాంలో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డే అని విజయసాయి రెడ్డి చెప్పడంతో.. పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో అండర్ గ్రౌండ్లో దాక్కున్న రాజ్ విచరాణకు వస్తానని అన్నారు. విజయసాయి బాగోతం అంతా బయటపెడతానని వార్నింగ్లు వదులుతున్నాడు.
ఇప్పుడు విజయసాయి చేసిన ట్వీట్ రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి వరకు మాత్రమే వెళ్తుందా? లేక జగన్ వరకు వెళ్తుందా అనేది చూడాలి. చూడబోతే జగన్ జుట్టు ఇప్పుడు విజయసాయి చేతిలో ఉంది. విజయసాయి భారతీయ జనతా పార్టీలో చేరతారని వార్తలు కూడా వస్తున్నాయి. వారి అండ ఉంది కదా అని విజయసాయి రెడ్డి ఇలా ఇప్పుడు అందరి బాగోతాలు బయటపెడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఇదేమో ముందే చేసి ఉంటే కనీస గౌరవం అయినా దక్కేది. ఇప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోయాక ఒక్కొక్కరి అంతు చూస్తా అంటూ ట్వీట్లు చేస్తే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు.