Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై దాడి చేయడం ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేయడం చూస్తుంటే.. కూటమి ప్రభుత్వం కావాలనే ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న కాపు నాయకులను టార్గెట్ చేస్తోందని అన్నారు వంగవీటి నరేంద్ర. ఆనాడు వంగవీటి రంగాను టార్గెట్ చేసినట్లు నేడు రాంబాబును టార్చర్ పెడుతున్నారని మండిపడ్డారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై గళం విప్పుతున్న వర్గాలు కాపులు, దళితులే అని అందుకే వారి గొంతు వినపడకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని కష్టాలు పెట్టినా తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా నడుచుకుంటామని హెచ్చరించారు.





