Ajit Pawar మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈరోజు ఉదయం తాను ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కూలడంతో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.
బారామతి జిల్లాలో విమానం 100 అడుగుల ఎత్తు నుంచే రన్వే మీదకు కూలుతూ వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఆయనతో పాటు విమానంలో ఉన్న పైలట్, కోపైలట్ కూడా మరణించారు.
అయితే.. అజిత్ పవార్ ప్రయాణించిన చార్టెడ్ విమానం లియర్ జెట్ 45 2023లోనూ కూలింది. ఈ విమానం VSR వెంచర్స్ సంస్థకు చెందిన వారిది.
ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో పైలట్కు సరైన విజిబిలిటీ లేక కూలిందని.. ఆ తర్వాత మంటలు అంటుకోవడంతో ఎవ్వరూ బతకలేదని VSR ఏవియేషన్ కెప్టెన్ వీకే సింగ్ తెలిపారు.





